News

రేపటి బంద్‌కు ప్రజల సహకారం లేదు


వ్యవసాయశాఖా మత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విపక్షాలు చేస్తున్న రేపటి బంద్‌కు ప్రజల సహకారం లేదని అన్నారు. ప్రజలంతా కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారని తెలిపారు. విపక్షాల బస్సుయాత్రకు ప్రజలెవరూ రావడంలేదని ఆయన ఎద్దేవాచేశారు. ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్న వందశాతం రుణమాఫీ చేసి తీరతామని. విపక్షాలు ఎన్నియాత్రలు చేసినా వారిని ప్రజలు నమ్మరన్నారు శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.